గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల గ్రామ పంచాయితీ పరిధిలో ఉపాధి హామీ పనులకు జాబ్ కార్డు కావాల్సిన వారు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని సచీవాలయం 1 పంచాయితీ కార్యదర్శి కె వి ఎస్ ప్రసాద్ కోరారు.
అదే విధంగా ఇసుక ఆన్ లైన్ బుకింగ్ కూడా ప్రారంభం అయిందని ఆయన తెలిపారు. ఇసుక బుక్ చేసుకున్న మూడు రోజులకే వస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం నుంచి ఇసుక బుకింగ్ ప్రారంభం కాగా ఇంటి యజమానులు ముందుకు వస్తున్నారు.