40.2 C
Hyderabad
April 26, 2024 12: 11 PM
Slider నెల్లూరు

బ్లీచింగ్ పౌడర్, కరోనా కిట్స్,108 వాహనాలు కాదేదీ స్కాం లకు అనర్హం

#Nellore TDP

వైసీపీ  ఏడాది పాలనలో రాష్ట్రాన్ని కొంభకోణాలకు కేరాఫ్ అడ్రెస్సుగా మార్చారని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఆరోపించారు. నేడు ఆయన కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రం ఇసుక, మట్టి, మద్యం మాఫియాల మయం అయిందని ఆయన అన్నారు. చివరకు ప్రజల ప్రాణాలతో  ముడిపడిన  కరోనా టెస్టింగ్ కిట్లు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడుతూ సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ల కొనుగోలు, నిర్వహణ లో కూడా కుంభకోణానికి పాల్పడ్డారన్నారు.

ఈ విషయం పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారు ఎంత పెద్ద వారైనా వారిపై చర్యలు తీసుకొని తమ చిత్త శుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, SK నాసీర్,మహమ్మద్,ఇంటూరు విజయ్, గరపాటి అనిల్, భదవరపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భార్యను చంపి లారీకి ఎదురెళ్ళి ఢీ కొని మృతి చెందిన భర్త

Satyam NEWS

రోడ్లు భవనాల శాఖలో నియామకాలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Satyam NEWS

Leave a Comment