29.7 C
Hyderabad
April 29, 2024 08: 05 AM
Slider మహబూబ్ నగర్

ముసాపేట్ లో మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

#sandmafia

మహబూబ్ నగర్ జిల్లా దేవర్ కద్ర నియోజకవర్గo ముసాపేట్ మండలంలో ఇసుక మాఫియా మళ్ళీ రెచ్చిపోతున్నదని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ అన్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో ఇసుక మాఫియాకు స్థానిక పోలీసులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయన్నారు.

గత 10 సంవత్సరాలుగా తాము ఇసుక మాఫియాపై పోరాడుతానే ఉన్నామని ఆయన తెలిపారు. నేనుసైతం సంస్థ ఎల్లప్పుడూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటుదన్నారు. ఇకనైనా ముసాపేట్ మండల రెవిన్యూ, పోలీస్ అధికారులు స్పందించి ఇసుక మాఫియాపై వాల్టా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో … నేనుసైతం ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తామని….ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటామని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Related posts

కాంట్రవర్సీ: ట్రాఫిక్ పోలీసులతో సిఎం మేనల్లుడి(?) రభస

Satyam NEWS

Forex Marketing Strategies to Bring Forex Leads

Bhavani

పాలిటెక్నికల్ రెమిడియల్ లెక్చరర్స్ పీఈటీలు వెంటనే ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment