28.7 C
Hyderabad
April 26, 2024 10: 31 AM
Slider మెదక్

ప్రజల జీవితాల్లో భోగా భాగ్యాలు కొత్త కాంతి రావాలి

harish sankranthi

రాష్ట్ర  ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా ఆర్ధిక మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని మంత్రి హరీష్ ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వం లో ప్రభుత్వం అభివృద్ధి , సంక్షేమ రంగంలో ముందుకు వెళుతున్నదని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. భోగి పండగ మన అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలని, ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలని భగవంతున్నీ కోరుకున్నాను అని ఆయన తెలిపారు.

Related posts

హెల్మెట్ ధరించి ప్రాణం కాపాడుకోండి

Satyam NEWS

బర్డ్‌లో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు

Bhavani

సీఎం ప్రకటనపై అంబర్ పేట్ టీఅర్ఎస్ నాయకుల సంబరాలు

Satyam NEWS

Leave a Comment