Slider తెలంగాణ

ఆకుపచ్చని పల్లెటూరు ఆ గ్రామం

pjimage (16)

ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రా(కె)గ్రామం అది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆ గ్రామం 6,500 మొక్కలను నాటింది. ఇది ఆ జిల్లాలోనే ఒక రికార్డు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ కు గ్రామస్తులకు టిఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జోగిన పల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కనూ ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మొక్కలు నాటాలని ట్విట్టర్ లో ఆయన నేడు కోరారు. ఈ గ్రామంతో అన్ని గ్రామా ల వారూ పోటీ పడాలని ఆయన సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే పలువురు మొక్కలు నాటుతూ పక్క వారికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అన్ని గ్రామాలూ ఈ గ్రామంలా చేసుకుంటే ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కృతం అవుతుందని సంతోష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

రైతు సాధికారిత పేరుతో అడ్డగోలు దోపిడి

Satyam NEWS

పటిష్ట నిఘా

Murali Krishna

మూత్ర పిండ క్యాన్సర్ కు మమత లో అరుదైన చికిత్స

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!