దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలు వివిధ రాష్ట్రాల్లో గ్రేడెడ్ పద్ధతుల్లో తెరుస్తున్నారు. అనేక రాష్ట్రాలు ఇప్పటికే కొన్ని తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరిచినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్లతో సహా మరికొన్ని రాష్ట్రాలు సోమవారం నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించాయి. పాఠశాలలు తిరిగి తెరవడానికి అన్ని రాష్ట్రాలు మార్గదర్శకాలను జారీ చేశాయి.
ఈ రాష్ట్రాలతో పాటు, కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయ కూడా నవంబర్ 2 నుంచి 9 నుంచి 12 తరగతులకు దేశవ్యాప్తంగా పాఠశాలలను తిరిగి తెరవాలని యోచిస్తోంది.
ఇప్పటి వరకు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మరికొన్ని రాష్ట్రాలు పాఠశాలలను తెరిచాయి. అనేక రాష్ట్రాలు నవంబర్లో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలనుకున్నాయి.
నవంబర్ 16 నుండి తమిళనాడు పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించగా, ఒడిశా నవంబర్ 16 నుండి 9 నుండి 12 తరగతులకు పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించాయి.
నవంబర్ 16 వరకు పాఠశాలలు, కళాశాలలు, విద్యా, కోచింగ్ సంస్థలు విద్యార్థులకు, సాధారణ తరగతులకు మూసివేయాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది.