విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో రెండవ అంతర్ కళాశాల యువ మహోత్సవాలు-2022 గోడ ప్రతులను ఉపకులపతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ఈ నెల 12 మరియు 13 తారిఖులలో జరుగు రెండవ అంతర్ కళాశాల యువ మహోత్సవాలులో యువతలో వున్న కళా నైపుణ్యతను ప్రతిభను జిల్లా మరియు దేశ స్థాయి లో ప్రదర్శించటానికి ఒక మంచి అవకాశం అన్నారు.
జిల్లా స్థాయిలో జరుగు పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి జనవరిలో తిరుపతి లో శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో జరుగు
36 వ సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్ కు పంపించటం జరుగుతుంది అన్నారు.
జిల్లా మరియు విశ్వవిద్యాలయం కు జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావటానికి ఇది ఒక సువర్ణావకాశం అన్నారు. కాబట్టి ప్రతి కళాశాల ప్రిన్సిపల్స్ ప్రత్యేక శ్రద్ద చూపించి ప్రతిభ గల విద్యార్థులను ఎంపిక చేసి అంతర్ కళాశాలల యువ మహోత్సవాలలో పాల్గొనే టట్లు ప్రోస్తహించాలని కోరారు.
అదేవిధంగా రిజిస్ట్రార్ డా. పి. రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం మరియు కృష్ణ చైతన్య విద్యాసంస్థలు సంయుక్తంగా ఈ యువ మహోస్త్వాలను నిర్వహిస్తున్నాయి అని తెలిపారు.
పూర్తి వివరాల కోసం, విశ్వవిద్యాలయ విద్యార్థి సంక్షేమ విభాగం సమన్వయకర్త
డా. హనుమా రెడ్డి ని సంప్రదించాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య విజయ అనంద కుమార్ బాబు ఆచార్య సుజా ఎస్ నాయర్, డా. టి వీరా రెడ్డి, డా. వెంకట్రాయుులు, డా.కే.సునీత, డా. ఉస్సేనయ్య, డా. ఉదయ్ శంకర్ మరియు బి. సుధారాణి పాల్గొన్నారు.