విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన జామి సురేశ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం 7 గురు నిందితులు కలిసి పక్కా వ్యహం తో కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జామి సురేష్ ను ఈ నెల 5 న కిడ్నాప్ చేసిన నిందితులు 5 కోట్లు డిమాండ్ చేశారు.
తను అంత ఇచ్చుకోలేనని చెబుతూ 30 లక్షలు కు డీల్ కుదుర్చుకున్నాడు. బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తానని చెప్పి నిందితులను బ్యాంకు కి తీసుకొని వెళ్లిన జామి సురేష్ ఇంతలో పోలీసులకు సమాచారం ఇవ్వడం తో నిందితులు అక్కడి నుండి పరార్ అయ్యారు.
జామి సురేష్ ని కార్ లో తీసుకొని వెళ్లి చితకబాది పరవాడ వద్ద కార్ తో సహా సురేష్ ని వదిలి పెట్టిన కిడ్నాపర్లు పారిపోయారు. నాల్గోవ పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసు లో ఏ2 ప్రతాప్ రెడ్డి, బాధితుడి సురేష్ కి గతంలో రైస్ మిల్ కేసులో పాత్ర ఉంది.
ప్రతాప్ రెడ్డి డబ్బులు సంపాదించాలని ఆశ తో ఏ1 ప్రసాద్ తో కుమ్మక్కు అయ్యి సురేష్ కు కిడ్నాప్ కు పథకం రచించాడు. 25 నుండి 28 వరకు రెక్కీ నిర్వహించి డి ఆర్ ఎం కార్యాలయం వద్ద కిడ్నాప్ చేశారు.
నేర చరిత్ర ఉన్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయరనే నమ్మకంతోనే నేర చరిత్ర ఉన్నవారు కిడ్నాప్ చేయడమే ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం. కిడ్నాప్ కేసులో ఇద్దరు అరెస్ట్ కాగా మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నారని నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందికి మీనా రివార్డు ప్రకటించారు.