ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క తన నామినేషన్ ను బుధవారం దాఖలు చేశారు. ముందుగా ములుగు జిల్లా లోని జకారం గ్రామపంచాయతీ పరిధిలో గల గట్టమ్మను దర్శించుకుని, మొక్కులుచెల్లించుకున్నారు.
అనంతరం అక్కడి నుంచి పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్ కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే సీతక్క ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో తనకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి జరిగే పోరాటంలో ధర్మంవైపు నిలబడే తనకు నియోజకవర్గ ప్రజలందరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే సీతక్క ప్రజలకు పిలుపునిచ్చారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలన లో అవినీతి అక్రమాలు, కుటుంబ పాలన కొనసాగిస్తూ ధనిక తెలంగాణగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ మార్చారని అన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయానికి ధర్మాన్ని జరిగే పోరాటంలో ధర్మవైపు నిలబడే తనకు అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు.
సత్యం న్యూస్, ములుగు