38.2 C
Hyderabad
April 28, 2024 20: 19 PM
Slider వరంగల్

గోదావరి ముంపు బాధితులను గుర్తించి ప్రభుత్వం ఇళ్లు కట్టివ్వాలి

#seetakka

ములుగు నియోజకవర్గంలో గోదావరి ప్రవాహానికి ముంపునకు గురైన ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య మంత్రి కెసిఆర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏటూరు నాగారం గోదావరి  వరుద ముంపు గ్రామాలను పరిశీలించడానికి వచ్చిన నేడు సీఎం కేసీఆర్ వచ్చిన విషయం తెలిసిందే.

బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం తో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని ఆమె కోరారు. ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, కొత్తగూడ మరియు గంగారం మండలాలలో ఒకపక్క వర్షపు నీరు మరోపక్క గోదావరి ప్రవాహమునకు ఇండ్లలోకి పంట పొలాల్లోకి నీళ్ళు చేరి ఇండ్లు పూర్తిస్థాయిలో నేలమట్టం అయ్యాయని ఆమె తెలిపారు. వరినార్లు, పత్తి మొక్కలు మరియు మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు దెబ్బతిన్నారని ఆమె తెలిపారు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురై పునరావాస కేంద్రాలలో బ్రతుకుతున్నారని సీతక్క తెలిపారు.

సీతక్క వినతి పత్రంలోని ముఖ్యాంశాలు

1.ఏటూర్ నాగారం, కన్నాయిగూడెం మంగపేట మరియు తాడ్వాయి  మండలాలతో పాటు మిగతా మండలాల్లో లోతట్టు ప్రాంతాలలో  ఉన్న 10,000 కుటుంబాల ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇండ్లును సురక్షిత ప్రాంతాల్లో నిర్మించి ఇవ్వవలెను.

2.ములుగు నియోజకవర్గంలో 9 మండలాలలో కురిసిన భారీ వర్షాలు కారణంగా గోదావరి మరియు వర్షపు వరదల వల్ల ఐ టి డి ఏ, పంచాయతీ రాజ్ మరియు ఆర్ &బి రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

3.పాకాల చెరువు,లక్నవరం మరియు రామప్ప చెరువుల వరద వల్ల ముప్పుకు గురైన రైతులను మరియు ప్రజలను ఆదుకోవాలి.

4.తుపాకులగూడెం, ఏటురునాగారం  నుండి రామన్నగూడెం మరియు మంగపేట మండలంలో  అకీనపల్లి మల్లారం వరకు కరకట్టకు రివుట్మెంట్ చేసి కాంక్రీట్ వాల్ నిర్మించాలి, ఏటురునాగారం, కన్నయుగుడెం మరియు మంగపేట మండలాలలో గోదావరి కోతకు గురైన పంట భూములు అంచనా వేసి రైతులను ఆదుకోవాలి.

5.గోదావరి  వరద ముప్పుకు గురైన వారందరికి తక్షణమే ఒక్కక్క ఇంటికి 25000/-  రూll  ల నుంచి 50,000 వరకు  నష్ట పరిహారం అందించాలి.

6. గోదావరి ముప్పకు గురైన ములుగు నియోజకవర్గ ప్రజలు,అట్టి గ్రామానికి  సంబందించిన స్థలంలో ఇండ్ల నిర్మాణం  అభివృద్ధి పనులను (రోడ్లు,కరెంటుపొల్లు,బ్రిడ్జి) నిర్మాణ అభివృద్దికి ఆటంకముగా ఫారెస్టు అధికారుల పనితీరు పై చర్యలు తేసుకోగలరు.

7.రాష్ట్ర ప్రభుత్వం గోదావరి కరకట్ట నిర్మాణం కోసం 137 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు  చేపట్టకపోవడంతో గోదావరి వరద నీరు గ్రామాలలోకి ప్రవహించి ఇండ్లు మునిగిపోయాయి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలి.

8.ములుగు నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఏజేన్సీ గ్రామాలలో వర్షానికి ఇంటర్నల్ రోడ్లు దెబ్బతిని, సైడ్ కాల్వలు లేక గుంతలుగా ఏర్పాడి నీళ్లు నిలవ ఉండడంతో విషజర్వాల భారిన పడి ప్రాణాలను కోల్పోచున్నారు.కావున అన్ని మండలాలలో రోడ్లు మరియు సైడ్  కాల్వలను ప్రత్యేక పాకేజీ కింద నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించి ముప్పు ప్రాంతాలలో వైద్య బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలి అని లేఖలో పేర్కొన్నారు.

Related posts

విదేశీ పర్యటన కు శ్రీకారం చుట్టనున్న బీజేపీ నేత రామ్ చందర్…!

Bhavani

ద్వాదశ జ్యోతిర్లింగ మహా పడిపూజ

Satyam NEWS

అక్షయ తృతీయ రోజు తగ్గిన బంగారం వెండి ధరలు

Satyam NEWS

Leave a Comment