32.7 C
Hyderabad
April 27, 2024 00: 16 AM
Slider హైదరాబాద్

విదేశీ పర్యటన కు శ్రీకారం చుట్టనున్న బీజేపీ నేత రామ్ చందర్…!

#Ram Chander

అమెరికాలో భారతదేశ ప్రధాని మోడీ ప్రభుత్వ విజయాలు హైలైట్ చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఆ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుకు బీజేపీ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆహ్వానం పలికింది .భారతీయ ప్రవాసులను ఉద్దేశించి, పీఎం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో సాధించిన విజయాలను వెలుగులోకి తీసుకురావడానికి మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ బిజెపి నాయకుడు ఎన్. రాంచందర్ రావుకు బిజెపి ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆహ్వానం పంపారు. 9 ఏళ్ల తెలంగాణ రాజకీయ అంశాలపై గురించి కూడా మాట్లాడతారని తెలిపారు.

రాంచందర్ రావు తన పర్యటనలో మొత్తం ఆరు రాష్ట్రాల్లో పర్యటించి ఏడు సమావేశాల్లో ప్రసంగించనున్నారు. అతని సందర్శనకు సంబంధించి.. మే 30న వాషింగ్టన్ DC, మే 31న వర్జీనియా & మేరీల్యాండ్, జూన్ 1న అట్లాంటా, జూన్ 2న డల్లాస్, జూన్ 3న షార్లెట్, జూన్ 4న రాలీ, జూన్ 6న న్యూజెర్సీలలో పర్యటిస్తారు.

ఈ సమావేశాల ఉద్దేశ్యం ప్రవాస భారతీయులతో నిమగ్నమై, నరేంద్ర మోడీ ప్రభుత్వం తన హయాంలో సాధించిన విశిష్ట విజయాల గురించి తెలియజేస్తారు అని ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ ప్రెసిడెంటు అడపా ప్రసాదు ,మాజీ ప్రెసిడెంట్ కృష్ణా రెడ్డి , తెలంగాణ శాఖ కన్వీనర్ విలాస్ జంబుల , అరవింద్ మోదీని మరియు కొంపల్లి శ్రీనివాస్ తెలిపారు

Related posts

కరోనా వేళ సంక్షేమ మార్గంలో నిర్మలమ్మ బడ్జెట్

Satyam NEWS

డేంజర్ బెల్స్: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా

Satyam NEWS

రెండవ రోజు ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment