కరోనా వైరస్ బారిన పడకుండా స్వీయ గృహ నిర్బంధం విధించుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి . చెన్నయ్య అన్నారు. చాలా దేశాలలో కరోనా 3వ , 4వ దశకు చేరుకోవడంతో వేలాది మంది మృత్యువాత పడ్డారని, లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
మానవ జాతి మనుగడ కోసం ప్రపంచం మొత్తం ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద, చిన్నా, తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని పలు జాగ్రత్తలు తీసుకొని వైరస్ బారిన పడకుండా తమకు తమను స్వీయ రక్షించుకోవాలని అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సూచనలను, సలహాలను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమష్టిగా పోరాడితే కరోనా వైరస్ ను శాశ్వతంగా భూస్థాపితం చేయవచ్చన్నారు. లాక్ డౌన్ ను పాటించాలని, ఇళ్ళ నుంచి ఎవరూ బయటకు రావద్దని ఆయన కోరారు. మన కోసం కృషి చేస్తున్న డాక్టర్లు , నర్సింగ్ సిబ్బంది , పోలీసులకు ఎల్లప్పుడూ రుణ పడి ఉంటామన్నారు.