రామ జన్మభూమి అయోధ్య వెలుగొందుతోంది. దీపావళి సందర్భంగా అయోధ్య వెలుగులమయం అవుతోంది. దీపావళికి ఒక రోజు ముందు దీపోత్సవ్ నిర్వహిస్తోంది. అత్యధికంగా దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఆయోధ్య రెడీ అవుతోంది. సరయు నదీ తీరంలో రామ్కీ పైడి ఘాట్లో 9 లక్షల దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేసింది.
అత్యధికంగా దీపాలను వెలిగించి రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొంది. 9 లక్షల దీపాలతో పాటు అయోధ్య పట్టణం అంతా కూడా దీపాలు వెలిగించే కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపింది. అయోధ్యతో పాటు ప్రపంచ వ్యాప్తంగా శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపింది.