కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి సేవాలాల్ 281వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపిపి కవిత విజయ్ బంజారా నాయకులు బద్యానాయక్ బాబు సింగ్ నందు నాయక్ మాజీ జడ్పిటిసి ప్రతాప్రెడ్డి మాజీ వైస్ఎంపీపీ నర్సాగౌడ్ టిఆర్ఎస్ అధ్యక్షులు రమేష్ నియోజకవర్గ గిరిజన సోదరులు జిల్లా గిరిజన శాఖ అధికారి అంబాజీ పాల్గొన్నారు.