తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏడుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులకు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లుగా పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిహెచ్ రూపేష్ కు జగిత్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా, మంచిర్యాల ఏసీపీ గా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ ను రామగుండం అడిషనల్ డిసిపి అడ్మిన్ గా నియమించారు. అదే విధంగా నికిత పంత్ ను సంగారెడ్డి అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా, బాలస్వామికి మెదక్ అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా, యోగేష్ కు మహబూబాబాద్ అడిషనల్ ఎస్పి అడ్మిన్ గా, రితి రాజ్ కు సూర్యాపేట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
previous post