29.7 C
Hyderabad
April 29, 2024 09: 31 AM
Slider హైదరాబాద్

ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు అందజేత

#ramjantofa

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రంజాన్ కానుకలు పంపిణీ విజయవంతంగా జరుగుతుందనీ  నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ముస్లిం సోదరులు ఆనందోత్సవాలతో పండుగ చేసుకోవాలని సూచించారు.

సోమవారం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ లోని ఇంద్రానగర్ రెహ్మానియా ఇద్గ మసీద్, గాంధీ నగర్ లో  ఉస్మానియా మసీద్  పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మాజీ కార్పొరేటర్ గంథం  జొత్స్నా నాగేశ్వరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  రంజాన్ తోఫా కానుకలను మేయర్ గద్వాల విజయలక్ష్మి ,ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్  పాల్గొని ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ తోఫా కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రంజాన్ కానుకలు పంపిణీ విజయవంతంగా జరుగుతుందన్నారు. అనంతరం పలువురు ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు.

కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు. పేద ప్రజలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పండగలు జరుపుకోవడానికి వారికి తగిన నిధులు, కానుకలు అందజేస్తుందన్నారు. హైదరాబాద్ నగరం మతసమరస్యానికి ప్రతీక అని మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ , మాజి కార్పొరేటర్ గొపు సదానంద్ ,  ముస్లిం సోదరి సోదరిమణులు, టిఆర్ఎస్ శ్రేణులు,మధుసూదన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,సంపత్ రావు,కొప్పు నర్సింగ్ రావు,సాలార్,సమీర్,ఫయాజ్ ,సమ్మద్ ,తుట్ నరసింహ,వెంపటి శ్రీను,బొసాని పవన్,ఆలే రమేష్ ,మనీష్ ,శ్రీనివాస్,  రవి,రాధమ్మ,లక్శ్మి ,మంజుల,రాంచంద్రాచారి,మహేందర్,రఘు,చేగురి శ్రీను,సాగర్ ,నరేష్ ,హరి          తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఈ సంవత్సరం కరోనా పూర్తిగా అంతరించిపోవాలి

Satyam NEWS

నాగర్ కర్నూలు జిల్లా లో వేసవి శిక్షణ శిబిరాలు

Satyam NEWS

పాపం 40 మంది పిల్లలు:వికటించిన మధ్యాహ్న భోజనం

Satyam NEWS

Leave a Comment