విస్తారంగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. స్థానిక 17వ వార్డు పోచమ్మ చెరువు మత్తడి నుండి, వివిధ వాడల నుండి వస్తున్న వర్షం నీరుతో బృందావన కాలనీ, సీతారామ కాలనీ, నాగదేవతా కాలనీ, సూర్య నగర్, వాసుదేవా కాలనీ జలమయమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రం మొత్తం అతలాకుతలం అయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతోనే సమస్యలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
previous post