టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అచ్చెంనాయుడులా సొల్లు కబుర్లు ఆడమని తమది చేతల ప్రభుత్వమని రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రిబొత్స సత్యనారాయణ అన్నారు. తాను రాజకీయాలలో తలపండినవ్యక్తి అని.. ఆరోపణలు నేనూ చేస్తానని కాని వాస్తవంగాఆలోచించి…మాట్లాడేప్పుడు ఆచి తూచిమాట్లాడాలని…బాబు, అచ్చెంనాయుడుల మాటలకు మంత్రి బొత్స కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
ఈ మేరకు నగరంలోని ప్రదీప్ నగరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇండ్ల నిర్మాణాలపై టీడీపీ నేతలు ఆడిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స ధీటుగా కౌంటర్ ఇచ్చారు. నాడు బాబు ప్రభుత్వహాయంలో..రెండున్నర లక్షల ఇండ్లపట్టాలని వేలలలో మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయని లెక్కలతో సహా మంత్రి బొత్స విలేఖరుల సమావేశంలోమాట్లాడారు.
కాని ఆ తర్వాత వైఎస్ఆర్ సీఎం హాయంలోనూ ప్రస్తుతం సీఎం జగన్ హాయంలోనూ తమ ప్రభుత్వం మాటకుకట్టుబడి..పేదల ప్రజల కష్టాలను తలొగ్గి..బ్యాంకులతో మాట్లాడి…అటు కేంద్రంలో కయ్యామాడి ఇండ్లనిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కానిఇవేవీ వాస్తవాలు తెలుసుకోకుండా..వాస్తవాలకు సదూరంగా టీడీపీ వ్యాఖ్యలు చేయడం..ఆ పార్టీ నేతల విజ్ఙతకే వదిలేస్తున్నానన్నారు.అప్పటికీ ఇప్పటికి పొరపాట్లు ఉంటే వాటిని నిరూపిస్తే..తాను తలదించుకుంటానని మంత్రి బొత్స స్పష్టం చేసారు.
చంద్ర బాబు నాయుడులా లాలూచీ పడం..!
రాష్ట్రానికి ప్రత్యేక హోద అత్యంత అవసరమని విభజన అయ్యేటప్పుడే చెప్పామని రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ది శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 13 జిల్లాల్లోఉన్న నిర్యుగోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక హోద ఎంతో అవసరమని మంత్రి బొత్స అన్నారు.ఈ మేరకు నగరంలోని తనసొదరుడు నివాసంలోఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ విషయం మాట్లాడారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోద కావాలని అది మా పార్టీ స్టాండ్ అని మంత్రి బొత్స అన్నారు.అటు పార్లమెంట్ లోని తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోద అంశాన్ని ప్రతీసారి ప్రస్తావనకుతీసుకువస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు.చంద్రబాబు లాగ లాలూజీ పడమన్నారు. చంద్రబాబులాగ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టమని మంత్రి బొత్స విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పారాడుతామన్నారు.దురదృష్టవశాత్తు..కేంద్రంలోతమపార్టీని వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చిందని మంత్రి బొత్స అన్నారు.దాని సాధించుకుని తీరుతామని..అది మాపార్టీఅజెండాలోనిప్రథాన అంశమని మంత్రి బొత్స స్పష్టం చేసారు.
వోక్స్ వేగాన్ మినహా..నా పైన మా కుటుంబంపై ఎలాంటి ఆరోపణలు లేవు
నాడు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో వోక్స్ వేగాన్ లో ముడుపులు , నిధలుస్వాహా చేసానన్న ఆరోపణలు మినహామిగిలిన ఇంకేమైనా గాని నా మీద నాకుటుంబం మీద ఎలాంటి ఆరోపణలు రాలేదని..వచ్చిన అవి సరికాదనిస్వయంగా కోర్టులే తేల్చి చెప్పామని రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రిబొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోతన సొదరుడు గజపతినగరం ఎమ్మెల్మే బొత్స అప్పలనర్సయ్య ఇంటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రిబొత్స సత్యనారాయణ మాట్లాడారు.
నగరంలోని ప్రదీప్ నగర స్థలాలకు సంబంధించి తన కుటుంబానికి అశోక్ గజపతి కుటంబానికి సంబంధింనసమస్యే గాని అటు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ భూములు తనవి కావిని అశోక్ గజపతి రాజు చెప్పడం అదీ కాకుండా మా తాతలు…పూసపాటివంశానికి సంబంధించిన అశోక్ గజపతి రాజులనుంచీ కొనుగొలు చేయడం..తద్వారా తమ కుటుంబం ఆ స్థలాన్ని..వాడుకుంటోందని..అడ్డుపడ్డవాళ్లు..ఆ స్థలం కావలసిన వాళ్లు…ఆధారాలతోస్వయంగా ఆర్డీఓవద్దకు వెళ్లొచ్చని మంత్రి బొత్స స్సష్టం చేసారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం