విజయనగరం జిల్లా కేంద్రం లో మరో కలకలం… ఇటీవలే నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద..అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో… ఓ బైక్ షాప్ ను గుర్తు తెలియని వ్యక్తులు… తగలబెడితే…తాజాగా 33 వ డివిజన్… బ్యాంక్ కాలనీ… పరిధిలోని గోపాల్ నగర్ వద్ద కడుతున్న ఓ అపార్ట్మెంట్ షెల్లార్ లో ఉన్న కారును…గుర్తు తెలియని వ్యక్తులు…దగ్ధం చేసారు.
అపార్ట్మెంట్ వాచ్ మెన్…అర్ధరాత్రి 1గంట వరకు ఉండి…అలా పడుకోవడంతో తెల్లవారు 3 గంటల ప్రాంతంలో ఏదో కాలుతున్న వాసన వస్తోందని వచ్చి చూస్తే కారు తగలబడుతూ కనిపించింది. వెంటనే… విద్యుత్ అపుజేద్దామని చూస్తే సర్వీసు వైర్ కట్ చేసి ఉంది.
వెంటనే యజమాని కి చెప్పడంతో తక్షణమే 100 ఫిర్యాదు చేయడంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పింది.సకాలంలో ఫైర్ ఇంజన్ రాకపోవడంతో… పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఇక …అను నిత్యం సత్యాన్వేషనల్ ఉంటున్న. .”సత్యం న్యూస్. నెట్”…తన పరిశోధన లో కొన్ని నిజాలు బయట పడ్డాయి.
నిర్మాణం లో ఉన్న అపార్ట్మెంట్ వెనకాల మరో పాత భవనం లో ఉంటున్న వాళ్లే పాత అంశాలపై.. కక్ష తో…ఈ దుశ్చర్యకు పాల్ప డి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. కాగా… సదరు ఇంట్లో ఉన్న వ్యక్తులు…రెండు రోజుల క్రితం నుంచీ మాతో మాట్లాడటం లేదని…”సత్యం న్యూస్. నెట్”కు…చెప్పారు.