38.2 C
Hyderabad
April 29, 2024 22: 00 PM
Slider ముఖ్యంశాలు

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికి అస్వస్థత

pasam yadagiri

సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి అస్వస్థతో ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమీర్‌పేటలోని ఇండో యూఎస్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా కుప్పకూలారు. వెంటనే ఆస్పత్రి వర్గాలు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలె ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రవీంద్రభారతిని తెలంగాణ కళలను ప్రచారం చేసేవారికి కాకుండా ఆంధ్రావారికి ఇస్తున్నారని, తెలంగాణ వారికి అన్యాయం జరుగుతున్నదని వాదనకు దిగడంతో సైఫాబాద్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాతి పరిణామాలలో కేసీఆర్ జర్నలిస్టు యాదగిరిని పూర్తిగా దూరం పెట్టారు. యాదగిరి ఈనాడు, ఉదయం లాంటి పత్రికలలో ఉన్నత స్థాయిలలో పని చేశారు.

Related posts

పసర నూతన ఇన్స్పెక్టర్ గా వంగపల్లి శంకర్

Satyam NEWS

బయోఇన్ఫర్మేటిక్స్ మీద అతిధి ఉపన్యాసం

Satyam NEWS

17న గంటలో కోటి మొక్కలు నాటేందుకు అక్కినేని పిలుపు

Satyam NEWS

Leave a Comment