గురుకుల కళాశాలలో విద్యార్ధులకు ఫుడ్ పాయిజన్ అయిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల కళాశాల ప్రిన్స్ పాల్ కు షోకాజ్ నోటీసు జారీ అయింది.
ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రిన్స్ పాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భావించారు.
అందులో భాంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఉయ్యాలవాడ గురుకుల కళాశాలలో సోమవారం రాత్రి విద్యార్థినిలు భోజనానంతరం అస్వస్థకు గురైన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శర్మన్ మంగళవారం సాయంత్రం ఉయ్యాలవాడ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్యకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
అవుట రాజశేఖర్, సత్యం న్యూస్