కడప జిల్లా సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఏకుల రాజేశ్వరిరెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తో బాటు 15 మంది డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా ఇంచార్జి అకేపాటి అమరనాధరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మేడా మధుసూధన్ రెడ్డి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకరణ కరణ అవసరం అని, సి ఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తారని అందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. అభివృద్ధి ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, రోజుకో నాటకం ఆడుతున్నారని అమరావతి ఉద్యమం కొన్ని గ్రామాలకే పరిమితం అని అన్నారు.
సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి విధేయురాలిగా, మాజీ ఎమ్మెల్యే అమరనాధరెడ్డి సహకారం తో తాను ఈ పదవి చేపట్టానని తెలిపారు.