29.7 C
Hyderabad
April 29, 2024 07: 16 AM
Slider ప్రపంచం

అమెరికాలో కిడ్నాప్ అయిన సిక్కు కుటంబం దారుణ హత్య

#murder

అమెరికాలో కిడ్నాప్‌కు గురైన నలుగురు ప్రవాస భారతీయులు హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిలో దంపతులు, వారి ఎనిమిదేళ్ల కుమార్తె, బాలిక బాబాయి ఉన్నారు. నలుగురు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన సిక్కు ఎన్నారై కుటుంబానికి చెందినవారు. నలుగురినీ కిడ్నాపర్ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సోమవారం నాడు, అమెరికాలోని కాలిఫోర్నియా ప్రావిన్స్‌లోని మెర్సిడ్ నగరంలో భారతీయ సంతతికి చెందిన జస్దీప్ సింగ్, అతని భార్య జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల కుమార్తె అరుహి, జస్దీప్ సోదరుడు అమన్‌దీప్ సింగ్‌లు కిడ్నాప్‌కు గురయ్యారు. ఓ తోటలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాలిఫోర్నియాలోని మెర్సిడ్‌లోని వ్యాపార కార్యాలయం నుండి నలుగురిని కిడ్నాప్ చేసినట్లు యుఎస్ అధికారులు తెలిపారు.

మెర్సెడ్ పోలీసు చీఫ్ షెరీఫ్ వెర్న్ వార్నెకే మాట్లాడుతూ, బుధవారం సాయంత్రం ఇండియానా రోడ్, హచిన్సన్ రోడ్ సమీపంలోని తోటలో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిపారు. తోటలో మృతదేహాలు కనిపించడంతో వ్యవసాయ కూలీ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి సమీపంలోనే నలుగురి మృతదేహాలు పడి ఉన్నాయి.

ఈ హత్య నిందితుడు జీసస్ మాన్యువల్ సల్గాడో అని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్‌కు సంబంధించి సల్గాడోను అమెరికా పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అతను కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అతను ఆత్మహత్యకు యత్నించినట్లు అర్థమవుతోంది. అతను ఈ పని ఎందుకు చేశాడనేది పోలీసులు విచారిస్తున్నారు.

Related posts

విఫలం చెందిన మంత్రి ఈటెల కేంద్రాన్ని విమర్శిస్తే ఎలా?

Satyam NEWS

6న ఆర్ధిక సంక్షోభం పై సెమినార్

Murali Krishna

రైతులకు నువ్వుల విత్తనాల సరఫరా

Satyam NEWS

Leave a Comment