28.7 C
Hyderabad
April 28, 2024 10: 51 AM
Slider ప్రత్యేకం

అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిన సిరిమానోత్సవం..

#vijayanagarampolice

విజయనగరంలోని శ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం ప్రశాంతంగా  ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కరోనా నిబంధనలతో పోలీసుశాఖ చేపట్టిన పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, ముందస్తు జాగ్రత్త చర్యలు సత్ఫలితాలిచ్చాయి. సిరిమాను వెంబడి జిల్లా ఎస్పీ ఎం. దీపిక తిరుగుతూ, బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు.

సిరిమానోత్సవం అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ళులో బ్యారికేడ్లును ఒక క్రమపద్దతిలో తొలగించి, వారు అన్ని మార్గాలలో వెళ్ళేందుకు అనుమతించారు. వృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుశాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు సేవాదళ్ విశేషమైన సేవలందించి, ప్రజల మన్ననలు పొందింది.

ట్రాఫిక్ రెగ్యులేషన్ కు ప్రత్యేక చర్యలు

సిరిమానోత్సవం అనంతరం సిబ్బంది విధుల నుండి వెళ్ళిపోకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టి, తమకు కేటాయించిన స్థానం వద్దనే ట్రాఫిక్ రెగ్యులేషన్ కు ప్రత్యేక చర్యలను పోలీసుశాఖ చేపట్టడం కూడా సత్ఫలితాలిచ్చింది.

సిరిమానోత్సవం సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగియుటకు అన్ని వర్గాల ప్రజల తమ వంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. విద్యుత్, అటవీ, ఆరోగ్య, మున్సిపల్, ఫైర్, రెవెన్యూ, దేవాదాయ మరియు ఇతర శాఖలు సమన్వయంతో పనిచేసాయన్నారు.

అదే విధంగా ప్రజలు, మీడియా, ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించారని, వారందరికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ధన్యవాదాలు తెలిపారు.

చోరీలు జరగకుండా పటిష్ట భద్రత

ఎటువంటి దొంగతనాలు జరగకుండా భక్తులను పోలీసు కంట్రోల్ రూం నుండి సిసి కెమెరాలను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు సంబంధిత పోలీసు అధికారులను అప్రమత్తం చేయడం, మఫ్టీలో పోలీసులు పహారా కాయడం, అనుమానితుల వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో చెక్ చేసి, వారు పాత నేరస్థులా? కాదా? అన్న విషయం నిర్ధారణ కావడంతో ఎటువంటి దొంగతనాలు జరగలేదు.

అన్ని ముఖ్య కూడళ్ళులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తాత్కాలిక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయడంతో సీసీ ఫుటేజులను కమాండ్ కంట్రోల్ నుండే పర్యవేక్షించారు. సీసీ కెమెరాల ఫుటేజులు పరిశీలించి, రద్దీని బట్టి, మార్గాలను మళ్ళించడం జరిగింది.

మంచి ఫలితాన్నిచ్చిన మొబైల్ కమాండ్ కంట్రోల్

ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫాల్కన్ మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఓఎస్డీ ఎన్.సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఎస్ ఈబి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, విజయనగరం డీఎస్పీ అనిల్ పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, మహిళా పిఎస్ డీఎస్పీ టి.త్రినాధ్, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు,

పీటీసీ డీఎస్పీలు వివి అప్పారావు, హస్మాన్ ఫర్హాన్, బాలరాజు బందోబస్తును పర్యవేక్షించి ఆయా ప్రాంతాలలో విధులు నిర్వహించే పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడగలిగామని, పోలీసు శాఖకు సహకరించిన జిల్లా ప్రజానీకానికి ఎస్పీ ఎం. దీపిక కృతజ్ఞతలు తెలిపారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

సోషల్ మీడియాలో పెయిడ్ వర్కర్లు లేరు

Satyam NEWS

విద్యార్థినిని ప్రోత్సహించిన కళింగాంధ్ర చైతన్య దీపిక

Satyam NEWS

ఈ నెల 19 నుంచీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

Satyam NEWS

Leave a Comment