రాష్ట్ర టీడీపీ పిలుపు మేరకు బంద్ కు ప్రయత్నించిన స్థానిక టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా రాజంపేట లో తెలుగుదేశం నేతలను మంగళవారం తెల్లవారు జామున రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెల్లవారుజామున బంద్ లో భాగంగా రాజంపేట ఆర్టీసీ డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పలువురు నేతలను అరెస్టు చేసి మన్నూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనితో పోలీస్ బందోబస్తు తో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి.
కాగా శాంతియుతం గా బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు దుర్మార్గంగా అరెస్ట్ చేయడం తగదని దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నేతలు తమ అరెస్ట్ ను ఖండించారు.