ప్రాణహిత పుష్కరాల్లో భాగంగా కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ప్రాణహిత పుష్కరాల్లో చివరి రోజు కౌటాల మండలం తుమ్మిడిహట్టి గ్రామంలో గల ప్రాణహిత నదికి భక్తులు పోటెత్తారు.
భక్తులు పెద్ద ఎత్తున హాజరై పుష్కర స్నానం ఆచరించారు. పోటెత్తిన భక్తజనం ఇబ్బంది పడకుండా తుమ్మిడిహట్టి వద్ద ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.