రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మై వేములవాడ వాట్సాప్ గ్రూపు కరోనా పీడితులకు నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉంది.
ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా వేములవాడ లక్ష్మిగణపతి కాంప్లెక్స్ లోని ఐసోలేషన్ సెంటర్లో కరోనా పాజిటివ్ పేషేంట్లకు, డ్యూటీలోఉన్నవైద్య సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మాంసాహార భోజనం సమకూర్చారు.
అలాగే రాత్రికికూడా భోజనం సమకూర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా లాక్డౌన్ పూర్తి అయ్యేవరకూ ప్రతీరోజు అల్పాహారం, భోజనం అందించనున్నట్లు గ్రూపు సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరి శంకర్, మధు మహేష్, నూగురి మహేష్ , రేగుల రాము, డాక్టర్ బెజ్జంకి రవీందర్, నాగుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.