ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. సాయంత్రం 7 గంటలకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిందేమీ లేదని, సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
సోనియాగాంధీ కొద్ది కాలం కిందట తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి ఎస్ రానా తెలిపారు.