ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో శనివారం జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ సమర్ధవంతమైన నాయకత్వంతో 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ విజయాలు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయని, అయితే కాంగ్రెస్కు ల్యాండ్మార్క్గా నిలిచిన భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నా. “ఇది ఒక మలుపు.”ఇది కాంగ్రెస్కు, యావత్ దేశానికి సవాలుతో కూడుకున్న సమయమని సోనియాగాంధీ అన్నారు.
దేశంలోని ఒక్కో సంస్థను బీజేపీ-ఆర్ఎస్ఎస్ స్వాధీనం చేసుకుని నాశనం చేశాయి. కొందరు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఆర్థిక విధ్వంసం ఏర్పడింది అని సోనియాగాంధీ విమర్శించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరుగుతున్న పార్టీ మూడు రోజుల సదస్సులో రెండో రోజు దాదాపు 15,000 మంది ప్రతినిధులను ఉద్దేశించి సోనియా మాట్లాడుతూ, భారత ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వం కోరుకుంటున్నారని అన్నారు.