హైదరాబాద్ నగరం లోని నిజమైన నిరుపేద కుటుంబాలను గుర్తించి ఏఇసిసి మైనారిటీ విభాగం జాతీయ కొ-ఆర్డినేటర్ ఎస్ జెడ్ సయీద్ రోజువారీగా సోనియాగాంధీ రేషన్ కిట్లను పంపిణీ చేశారు. నగరం లోని సన్ సిటి ,అత్తాపూర్, గాంధీ నగర్, చంచల్ గూడా, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా సయీద్ మాట్లాడుతూ 10 కిలోలు బియ్యం, 2 కిలోలు ఆటా, ఒక లీటరు నూనె, చక్కెర, టీ, ఉల్లిపాయ మొదలైన వాటితో పాటు మొత్తం 15 కిలోల రేషన్ కిట్స్ను అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలకు ఉపశమనం కల్పించడంలో బిజీగా ఉన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషిని ఈ సందర్బంగా ప్రశంసించారు. వలస కార్మికులకు అవసరమైన సహాయం అందించినందుకు, స్వరాష్ట్రాలకు తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.
ధనవంతులు, పరోపకారులు మానవతా దృక్పదం తో అవసరమైన సమయంలో నిజమైన నిరుపేదలకు ఉపశమనం కలిగించడానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.