38.2 C
Hyderabad
April 29, 2024 11: 26 AM
Slider మెదక్

అమరవీరులకు నివాళి అర్పించిన మెదక్ ఎస్పి

#SP Rohini Priyadarshi

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని తెలంగాణ అమరులకు నివాళులు అర్పించారు. చిన్న శంకరంపెటలో ఉన్న అమరుల స్థూపం వద్ద మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ రాజార్షి షా ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ నివాళులు అర్పించి మౌనం పాటించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూన్నామని అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.

దశాబ్దాల పోరాటం, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సారథ్యంలో నేడు దేశంలోనే తెలంగాణ పోలీసులు అన్ని విభాగాల్లో ముందున్నారన్నారు. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులు ప్రజల శాంతిభధ్రతలను కాపాడటానికి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

Related posts

మానవత్వం చాటిన నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులందరూ ఓట్లు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

టీడీపీ సీనియర్ నేత అశోక్ పుట్టినరోజు రెండు రోజుల పాటు..

Satyam NEWS

Leave a Comment