రంగారెడ్డిలోని శేరిలింగంపల్లిలోని మియాపూర్లో గుట్టుగా పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్నఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ నగర్ లో పేకాట ఆడుతున్నపేకాట స్థావరం పై మాదాపూర్ SOT పోలీసుల దాడులు చేశారు. పేకాట ఆడుతున్న10 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 58 వేల నగదు,10 మొబైల్ ఫోన్లు, ఒక పేకాట సెట్నుస్వాధీనం చేసుకొని మియపూర్ పోలీసులకు అప్పగించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post