అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఆరో రోజు ఉదయం శేష వాహనం పై మోహిని అవతారంలో స్వామి వారు మాడ వీధుల్లో విహారించారు.
స్వామివారిని వివిధ రకాలపూలతో పట్టు వస్త్రాలతో స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. మంగళ వాయిద్యాల నడుమ,భక్తుల గోవిందనామాల మధ్య ఈ గ్రామోత్సవ జరుగగా పెద్ద సంఖ్యలో భక్తులు నారికేళం,పండ్లు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి, సమన్వయ కర్త మేడా విజయ శేఖర్ రెడ్డి,ఆలయ చైర్మన్ అరిగెల సౌమిత్రి చంద్రనాథ్,ఈవో కొండారెడ్డి, శేషారెడ్డి, ఆలయ అర్చకులు సునీల్ శర్మ,సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు.