ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కు కరోనా పాజిటీవ్ వచ్చింది. అయితే ఆయనకు పెద్దగా రోగ లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. ఆయన ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
తన అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం కోరారు. అంతే కాకుండా తన ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని కనుక్కోవడానికి ఫోన్ లు చేయవద్దని ఆయన కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.