28.7 C
Hyderabad
April 27, 2024 04: 13 AM
Slider విజయనగరం

సరాసరి నేరస్థలానికి ఫోర్ న్సిక్ బృందంతో పోలీసు బాస్…!

#police

హత్య కేసు దర్యాప్తు అధికారిగా సీఐ తిరుమల రావు నియామకం…!

ఇటీవలే విజయనగరం జిల్లా తెర్లాం మండలం వెలగల్ల వలసలో జరిగిన హత్య ఘటన పోలీసుల మెడకు చుట్టుకుంటున్నట్లు పరిస్థితులు గోచరిస్తున్నాయి.హత్యోదంతంపై పలు రకాల ఉదంతాలు వెల్లువడుతుండటం…దీనికి తోడు అసలు జరిగిన హత్య కేసులో పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో జిల్లా ఎస్పీ దీపికా… కేసు ను సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది 

ఈ క్రమంలో… ఏకంగా ఫోరన్సిక్ బృందంతో సరాసరి హత్య జరిగిన ఘటనా స్థలిని..ఎఫ్.ఎస్.ఎల్ బృందం తో ఘటనాస్థలికి వెళ్లి నేరుగా ఘటనాస్థలిని పరిశీలించారు.  దీంతో తెర్లాం మండలం వెలగవలస గ్రామ శివార్లలో గల మామిడి తోటలో హత్య కాబడిన గుర్తు తెలియని వ్యక్తి కేసులో నేర స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ అధికారులు సందర్శించి, హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్య కేసు మిస్టరీని చేధించేందుకు ప్రత్యేక బృందాలను నియమించి, దర్యాప్తు వేగవంతం చేయాలని సీఐ  ఎస్.తిరుమలరావు ను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

Related posts

విద్యల నగరంలో వ్యాపారి కిడ్నాప్…24 గంటలలో కేసు ఛేదింపు

Satyam NEWS

అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

Bhavani

ఆసియా దేశాల సదస్సుకు చిట్టిబాబు

Satyam NEWS

Leave a Comment