క్రికెట్ ఆడండిరా అని ఆస్ట్రేలియా పంపితే వారితో బాటు వారి గర్ల్ ఫ్రండ్స్ కూడా ఆస్ట్రేలియా చేరుకుంటున్నారు. యువ క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా చేరుకున్నారు. వీరిని అనుసరిస్తూ ఇద్దరు బ్యూటీలు కూడా ఆస్ట్రేలియా చేరడంతో ఫోకస్ అంతా వారిపై పడింది. డ్యాన్సర్, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆస్ట్రేలియా చేరుకుని తన ఇన్స్టాగ్రామ్లో ఈ మేరకు పోస్ట్ను షేర్ చేశారు. ధనశ్రీ, యుజ్వేంద్ర విడిపోయినట్లు వార్తలు వెలువడుతున్న తర్వాత కూడా సోషల్ మీడియాలో ఒకరి చిత్రాలను ఒకరు ఇలా పంచుకుంటున్నారు.
ధనశ్రీ తన చిత్రాన్ని పంచుకుంటూ రాసిన క్యాప్షన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె క్యాప్షన్ చదివిన పాఠకులు ధనశ్రీ పరోక్షంగా నటి ఊర్వశి రౌతేలాపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఊహాగానాలు చేస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా క్రికెటర్ రిషబ్ పంత్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. ధనశ్రీ ట్విట్టర్ లో నా హృదయం నన్ను ఆస్ట్రేలియాకు తీసుకువచ్చింది. నా మనిషి కోసం నేను అక్కడికి వెళ్లవలసి వచ్చింది” అని ధనశ్రీ రాసింది. అంతకు ముందే ఆస్ట్రేలియా చేరుకున్న ఊర్వశి రైతేలా కూడా దాదాపుగా ఇలాంటి కామెంట్ తోనే పోస్టు షేర్ చేసింది.
నిన్ను అనుసరిస్తూ నా హృదయం నన్ను ఆస్ట్రేలియాకు తీసుకువచ్చింది…. అంటూ ఊర్వశి పోస్టు చేయడంతో ధనశ్రీ కూడా అలాంటి పోస్టే షేర్ చేసుకోవడం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధనశ్రీ ఇటీవలే నేహా కక్కర్ ‘ఓ సజ్నా’ పాటలో కనిపించింది. ఇది ఫల్గుణి పాఠక్ హిట్ పాట మైనే పాయల్ హై ఛంకైకి రీమేక్. బాలివుడ్ నటి ఊర్వశి రౌతేలా సినిమాల సంగతి ఎలా ఉన్నా తన దృష్టి మొత్తం రిషబ్ పంత్ పైనే పెట్టింది.