గత వారం పది రోజులుగా తుఫాను ప్రభావం వల్ల వర్షాలు అధికంగా పడుతుండడంతో, విష జ్వరాలు ప్రబలకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో, కోరంటి ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్య బృందం అంబర్పేటలో ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ అంబర్ పేట డివిజన్ ప్రేమ్ నగర్ లో వైద్యులతో కలిసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నేటి నుంచి అంబర్ పేట డివిజన్ ప్రజలకు ఎవరికైనా వైరల్ ఫీవర్స్ డెంగ్యూ,టైఫాయిడ్,మలేరియా, లాంటి విష జ్వరాల బారిన పడితే ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా కూడా వారి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సులు శ్యామల, కవిత, ల్యాబ్ టెక్నీషియన్ శివాని, ఆశా వర్కర్లు విజయలక్ష్మి, శోభ జిహెచ్ఎంసి సిబ్బంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాక నర్సింగ్ గంగపుత్ర, షాహిన్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్