40.2 C
Hyderabad
April 29, 2024 17: 20 PM
Slider తెలంగాణ

యాక్సిడెంట్ :ఖమ్మంలో ఇద్దరి మృతి 5గురికి గాయాలు

khammam accsident

బుధవారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దిమ్మెను ఢీకొట్టింది.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను రాజమండ్రికి చెందిన కమలంపూడి సూర్‌రెడ్డి(66), హేమంత్ రెడ్డి (8)లుగా గుర్తించారు. సూర్ రెడ్డి కుటుంబం మంగళవారం కర్ణాటకకు పని నిమిత్తం వెళ్లి తిరిగి రాజమండ్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సూర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా. కారులో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

సీబీఐకి చిక్కిన వైజాగ్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్  

Satyam NEWS

గుంటూరు జిల్లా వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Satyam NEWS

Leave a Comment