యూత్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడిదల రాము కొల్లాపూర్ పట్టణం కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తకాపు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు కొల్లాపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు రామ్ యాదవ్, కొల్లాపూర్ యూత్ జోడో బూత్ జోడో ఇంచార్జీ కృష్ణ నాయక్, కొల్లాపూర్ తాలూకా యువజన అధ్యక్షులు దాసరి ఉదయ్ కుమార్ యాదవ్, అచ్చంపేట యూత్ జోడో బూత్ జోడో ఇంచార్జ్ పవన్ కుమార్ పాల్గొన్నారు. కొల్లాపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటం మౌలాలి ఆధ్వర్యంలో యూత్ జోడో,బూత్ జోడ్ కార్యక్రమం లో భాగంగా నలుగురు కోఆర్డినేటర్లను నియమించారు. రాము, రాజేందర్, బాలకృష్ణ, లింగం కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.
ప్రతి బూతులో ఐదు మంది చొప్పున యూత్ కాంగ్రెస్ నాయకులు వెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన కార్యక్రమాలు, ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ ఉండే విధంగా చేయాలి సమావేశంలో మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ టౌన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కురుమయ్య, టౌన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు జహీత బేగం, కుడికిల్ల గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గంట రాము రవీందర్ పరమేష్ కురుమూర్తి మల్లేష్ శంకర్, మహేష్, రాము, సోమశిల నాగరాజు, కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్ కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఇతరులు పాల్గొన్నారు.