42.2 C
Hyderabad
April 26, 2024 15: 28 PM
Slider ఆధ్యాత్మికం

మేళ్ళచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

#mellacheruvu temple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని అత్యంత సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారిని గురువారం వారణాసి శివ క్షేత్రం నుండి వచ్చిన శ్రీ సత్యానంద గిరి స్వామి(లాలీ బాబా అఘోర స్వామి) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ సంప్రదాయాల ప్రకారం కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మేళతాళాలతో అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ,ధనుంజయ శర్మ ఆలయ విశిష్టతను,చరిత్రను వివరించారు. శంభు లింగేశ్వర స్వామి వారికి  పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి,స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.అనంతరం స్వామి వారి శేష వస్త్రాలతో అఘోర స్వామిని సన్మానించి తీర్థ,ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ సత్యనారాయణ,బోగాల కొండారెడ్డి, గ్రామ పంచాయితీ ఈవో నారాయణరెడ్డి, గ్రామ పెద్దలు,భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

భూ వివాదంలో దాడికి గురైన దళితుల్ని పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లారు?

Satyam NEWS

ఈ సారి కేంద్రం జోక్యం ఉండకపోవచ్చు…..?

Bhavani

ఆర్టీసీ విలీనం ప్రతిపాదన వదులుకున్న యూనియన్

Satyam NEWS

Leave a Comment