పంజుగుల దుర్గమ్మ గుడిలో పోలమల్లయ్య , పోల ప్రమీలమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో శుక్రవారం ఏకాదశి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కీర్తిశేషులు పోల రాఘవులు ప్రథమ కుమారుడు పోల మల్లయ్య ప్రమీలమ్మ దంపతులతో పాటు వారి సోదరుల, సతీమణులతో ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, భక్త బృందం వారిచే ఘనంగా నిర్వహించారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తబృందం వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పోల మల్లయ్య మాట్లాడుతూ పంజుగుల గ్రామంలో ఈ దేవాలయంలోని అమ్మవారు శక్తివంతమైన దేవిగా భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా వెలసిన అమ్మవారు అని తెలిపారు. ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా దాతలు అధిక సంఖ్యలో విరాళాలు అందజేసి చిన్నగా ఉన్న దేవాలయాన్ని పెద్దదిగా మార్చడం జరిగిందని, అదేవిధంగా దాతల సహకారంతో దేవాలయ కమిటీ ఏర్పాటుకు కార్యాలయమును ఒక బ్రాహ్మణుడు నివసించడానికి రెండు గదులను నిర్మించి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారికి సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పోల పర్వతాలు ,భాగ్యమ్మ , మల్లేశ్వర్ సుజాత విష్ణు సహస్రనామ భక్తమండలి, లలితా సహస్రనామ భక్తమండలి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.