తిరుమలలో మే 1 నుండి 3వ తేదీ వరకు జరగాల్సిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను టిటిడి వాయిదా వేసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో నారాయణగిరి ఉద్యానవనాలకు బదులుగా శ్రీవారి ఆలయంలోనే ఈ ఉత్సవాలను నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే, ఈ ఉత్సవాల నిర్వహణకు ఎక్కువ సిబ్బంది అవసరమవుతారని, సామాజిక దూరం పాటించలేని పరిస్థితి ఉంటుందని అధికారులు భావించారు.
ఈ పరిస్థితుల్లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామివారు, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు, ఆగమ సలహాదారుల సూచనల మేరకు లాక్డౌన్ తరువాత మరో తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ ఉత్సవాల తేదీలను తరువాత ప్రకటిస్తారు.