శ్రీరాముడు… మూర్తీ భవించిన దేవుడు. మానవుడు దేవుడయ్యాడంటే…అదెవ్వరో కాదు ఆ శ్రీరామచంద్రుడే.శ్రీరాముడు చరిత్ర ను పరిశీలిస్తే…. మానవుడు ఇలా మసలుకోవాలని చెప్పేది…
శ్రీరాముని చరితం.అలాంటి శ్రీరాముడు.. జన్మదినం రోజు అయిన ఈ రోజు దేశ వ్యాప్తంగా వైభవోపేతంగా రాములోరి కల్యాణం జరగడంతో పాటు వాడ వాడలా..వీధి వీధిన… ప్రతీ ఇంట్లో ప్రతీ గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా ఏపీలో ని విజయనగరం లో శ్రీరాముడు ని అనునిత్యం కొలిచే శకుంతల సన్యాసి రాజు ఇంట్లో కన్నుల పండువగా వేడుకలు జరిగాయి
. శకుంతల సన్యాసి రాజు ఇంట్లో అనునిత్యం రాముడు ని కోలవగా ప్రతీ ఆదివారం రాముని భజన చేస్తారు… కుటుంబ సభ్యులు. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇంట్లో రాములోరి కి వైభవోపేతంగా పూజలు చేయడం తో పాటు ఇంటిల్లి పాది…పాటలు, నృత్యాలతో ఓ భక్తి పారవశ్యం తో ఆ శ్రీరామచంద్రుని కొలవడం విశేషం