అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలోని “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” అనే కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇంచార్జీ భత్యాల చెంగల రాయుడు నిర్వహించారు.
సుదర్శన్ నగర్, మన్నూరు ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, అడ్డగోలుగా నిత్యవసర ధరలు, మద్యపానం,మాదకద్రవ్య సమస్య, కుంటుపడిన అభివృద్ధి, ఇసుక మాఫియా, తాగునీటి సమస్య, అవినీతి, మహిళల భద్రత, కరెంటు సమస్య, దుర్భరమైన రోడ్లు, నిధులు దుర్వినియోగం, గిట్టుబాటు ధరలు, రాజధాని రాజకీయాలు, నిలకడలేని పాలన, రేషన్ కార్డులు, పించన్లు కోత వంటి విషయాలపై అవగాహన కల్పించారు.
వారు వీటిలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు తెలుసుకున్నారు.ఇంకాఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నారు.