అణుగారిన ప్రజలకు సామజిక న్యాయం సాధించిపెట్టిన విశిష్ట రాజకీయ నాయకుడు బాబు జగ్ జీవన్ రామ్ అని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. రాములు యాదవ్ కొనియాడారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అద్భుతమైన పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది బాబు జగ్ జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్, బషీర్ బాగ్ వద్దనున్న బాబు జగ్ జీవన్ రామ్ విగ్రహానికి బి. రాములు యాదవ్ తోపాటు ఏ.ఐ.ఎఫ్.బి గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి వెంకటేష్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ సయ్యద్ తౌఫిక్ అలీ రంగారెడ్డి జిల్లా టియుసిసి కార్యదర్శి బండి నరసింహ రాజు తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా బి. రాములు యాదవ్ మాట్లాడుతూ అంటరాని వారికి హక్కులు మరియు సమానత్వం సాధించడానికి బాబు జగ్ జీవన్ రామ్ తన జీవితాన్ని అంకితం చేసారని గుర్తు చేసారు. బాబు జగ్ జీవన్ రామ్ సంస్థాగత నైపుణ్యాల కారణంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత అతను గుర్తించబడ్డాడని, 1935లో, అతను ఆల్-ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటుకు బోస్ సహకరించాడని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అద్భుతమైన ప్రతినిధిగా, సంఘ సంస్కర్తగా ఆయన దేశానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయకం అని బి. రాములు యాదవ్ తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్