ఎన్నికల గోదాం వద్ద పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని వివి పాట్, ఈవియం గోడౌన్ ను తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా గోదాం సీలు, సిసి కెమేరాలు పరిశీలించారు. గోదాం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవియం గోదాం రక్షణ ఏర్పాట్లను తనిఖీ చేసి నివేదిక పంపనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సురేష్ కుమార్, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.
previous post