31.7 C
Hyderabad
May 2, 2024 10: 22 AM
Slider ముఖ్యంశాలు

బాసర ఐఐఐటి లో విద్యార్ధిని ఆత్మహత్య

#suicide

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. దీపిక (17) అనే విద్యార్థి బాత్రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరెకల్ గ్రామానికి చెందిన దీపిక బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.

ఉదయం ఆమె ఫిజిక్స్ పరీక్ష రాసింది. అనంతరం మధ్యాహ్నం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలోని బాత్రూమ్ కు వెళ్లింది. అయితే ఎంత సేపటికి దీపిక బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి స్నేహితులు బాత్రూమ్ తలుపులు కొట్టారు. అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ తలుపులు తెరవకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు.

సిబ్బంది వచ్చి బాత్రూం తలుపులు పగలగొట్టి చూడగా దీపిక చున్నీతో ఉరేసుకొని అపస్మారకస్థితిలో ఉంది. దీంతో ఆమెకు క్యాంపస్ లోని హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ దీపిక చనిపోయింది. కాగా దీపిక ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణం చేస్తున్నారు.

Related posts

Celebrations: నేడు జో బైడెన్ 78వ పుట్టిన రోజు

Satyam NEWS

నాగర్ కర్నూల్ లో బిసి విద్యార్ధులకు గ్రూప్ 1, 2, పోలీసు శిక్షణా తరగతులు

Satyam NEWS

తాడికొండ ఎమ్మెల్యేకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని

Satyam NEWS

Leave a Comment