విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల మేధస్సుకు పదును పెట్టేందుకు ఏటా వేసవి సెలవుల్లో ఇస్రో ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలపై ఆన్లైన్ పాఠాలు అందిస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు అన్నారు.
సోమవారం సాయంత్రం డీఈవో కార్యాలయంలో ఇస్రో పరిశోధనల అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఉపగ్రహ ఛాయా చిత్రాల పై అవగాహన కల్పిస్తారు అన్నారు.
భౌతిక శాస్త్ర, జీవశాస్త్ర మరియు గణిత ఉపాధ్యాయులు ఈనెల 20వ తేదీ లోపు ఆన్లైన్లో క్రింద తెలిపిన లింకు నమోదు చేసు కోవాలన్నారు. www.iirs.gov.in తేదీ 23.05.2022 నుండి28.05.2022 వరకు శిక్షణా తరగతులు ఉంటాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి(9989921105) ని సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ ప్రసాద్ గౌడ్ స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్ల శెట్టి ఉపాధ్యాయులు వెంకటయ్య పాల్గొన్నారు.