పుల్వామా ప్రాంతంపై పాకిస్తాన్ ఉగ్రమూకలు జరిపిన దాడిలో మరణించిన CRPF జవాన్లకు ములుగు జిల్లా కేంద్రంలో సన్ రైజర్స్ హైస్కూల్ విద్యార్ధులు ఘన నివాళి అర్పించారు. 2019 ఫిబ్రవరి 14 న జరిగిన ఈ దాడిలో మొత్తం 40 మంది CRPF జవాన్లు మరణించారు. వారిని స్మరించుకుంటూ జవానులకు నివాళి అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ములుగు జడ్పిటిసి సకినాల భవాని మాట్లాడుతూ కంటికి కునుకులేకుండా దేశ రక్షణ కోసం అహర్నిశలు కష్టపడి మనల్ని కాపాడుతున్నారని వారి వల్ల సుఖవంతమైన జీవితం గడుపుతున్నామని అన్నారు. వారికి కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం జడ్పిటిసి రుద్రమదేవి, పాఠశాల కరస్పాండెంట్/ ప్రిన్సిపాల్ పెట్టెం రాజు, వైస్ ప్రిన్సిపల్ బల్గూరి జనార్ధన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.