కరోనా కష్టాలతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని ఆవేదన చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ లో ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యయత్నం చేశాడు. ఎండీ నజిరుద్దీన్ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఆత్మహత్యాయత్నం చేయడంతో ఒక్క సారిగా అక్కడి పోలీసులు హుటాహుటిన ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
రెండు నెలలుగా పని లేకపోవడంతో కుటుంబం సాకలేకపోతున్నానని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా వ్యాపారం లేదని దాంతో ఆదాయం రాలేదని నజిరుద్దీన్ అంటున్నాడు. వ్యాపారం-ఆదాయం లేకపోవడంతో కుటుంబంలో తీవ్రంగా ఆర్థిక వత్తిడిలో ఉందని నజిరుద్దీన్ తెలిపారు. ప్రభుత్వం తన లాంటి చిరు వ్యాపారులకు ఆదుకోవాలని నజిరుద్దీన్ కోరాడు.
తన బాధ ఎవ్వరికి చెప్పుకోవలో తెలియలేదని అందుకే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అతడు చెప్పారు. పంజాగుట్ట పోలీసులు నజిరుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు.